25, ఫిబ్రవరి 2012, శనివారం

 ఎపి న్యూస్ లైన్ .కాం ప్రారంభం
ఎపి న్యూస్ లైన్ .కాం పేరుతొ సరికొత్త వెబ్ సైట్ ప్రారంభమైంది. తెలుగులో తాజా వార్తలు.. రాజకీయ.. సామాజిక.. జాతీయ.. అంతర్జాతీయ  అంశాలపై విశ్లేషణలు అందించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వెబ్ సైట్ రూపొందింది. జర్నలిజంలో పాతికేళ్ళ అనుభవమున్న సీనియర్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ వెబ్ సైట్ మీ అందరి ఆదరాభిమానాలు పొందుతుందని ఆశిస్తున్నాం. ఎపి న్యూస్ లైన్ .కాం చూసి మీ.. అమూల్యమైన సూచనలు..సలహాలు పంపాల్సిందిగా కోరుతున్నాం.  
- మీ
-శివరామకృష్ణ వల్లూరు.

21, ఫిబ్రవరి 2012, మంగళవారం


ఎసిబి వైఖరి వల్లే అనుమానాలు: మోపిదేవి

ద్యం సిండికేట్ల వ్యవహారంలో ఎసిబి వైఖరి వల్లే తనపై అనుమానాలు కలుగుతున్నాయని, ఎసిబి వైఖరిని ఖండిస్తున్నానని ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. తనకు ముడుపులు ఇచ్చినట్లు మద్యం సిండికేట్ల కింగ్ పిన్ నున్న రమణ చెప్పినట్లు మరోసారి వార్తలు రావడంతో ఆయన మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఎసిబి వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆయన రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, ముఖ్యమంత్రితో మోపిదేవి భేటీ తర్వాత అటువంటిదేమీ లేనట్లు తేలింది. మద్యం సిండికేట్ల వ్యవహారంలో తన ప్రమేయం లేదని ముఖ్యమంత్రి నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. మద్యం సిండికేట్ల వ్యవహారంతో తనకు సంబంధం లేకపోయినప్పటికీ తననే లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారుమద్యం సిండికేట్ల వ్యవహారం ఎల్లుండి శాసనసభలో ప్రస్తావనకు వస్తుందని ఆయన చెప్పారు. తాను సమాధానం ఇస్తానని ఆయన చెప్పారు. 
xxxxxxxxxxxxxxxxxxxxx

మోపిదేవి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

ది లక్షల రూపాయల ముడుపుల వ్యవహారంలో ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. మోపిదేవికి పది లక్షల రూపాయల లంచం ఇచ్చిన మాట నిజమేనని నున్న రమణ తన కస్టడీ రిపోర్టులో చెప్పాడు. నున్న రమణను కస్టడీలోకి తీసుకుని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు రెండు రోజుల పాటు ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలోని రెండు మద్యం సిండికేట్ల మధ్య సెటిల్మెంట్ జరిపిన వ్యవహారంలో తాము మోపిదేవికి పది లక్షల రూపాయల ముడుపులు ఇచ్చామని అతను చెప్పాడు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఎసిబి అధికారులు రమణను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మోపిదేవికి తాము విధంగా ముడుపులు అప్పగించామనే విషయాన్ని రమణ తన నేరాంగీకర పత్రంలో వివరించారు. రెండు సిండికేట్ల మధ్య గొడవతో రెండు గ్రూపులవాళ్లం మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రిని కలిశామని, ఇరు వర్గాల మధ్య మంత్రి పంచాయతీ చేశారని, అందుకు గాను తాము పది లక్షల రూపాయలు మంత్రి ఇచ్చామని అతను చెప్పాడు. ఇరు వర్గాలకు చెందిన 14 మంది మంత్రి వద్దకు వచ్చారని, పంచాయతీ చేసి మంత్రి రెండు గ్రూపులకు చెందిన ఇద్దరేసిని లోపలికి పిలిచి పది లక్షల రూపాయలు తీసుకున్నారని రమణ చెప్పాడు. 
Xxxxxxxxxxxxxxxxxxx

కాంగ్రెసు అభ్యర్థుల ప్రకటన

ఎన్నికల్లో ఏడు శాసనసభా స్థానాలకు ఎఐసిసి తన అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్నగర్ నుంచి దివంగత శాసనసభ్యుడు రాజేశ్వర రెడ్డి సతీమణి విజయలక్ష్మి పేరును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపాదించారు. అయితే, స్థానానికి ముత్యాల ప్రకాష్ పేరును ఎఐసిసి ఖరారు చేసింది. విజయలక్ష్మిని స్థానిక నాయకులు పెద్ద యెత్తున వ్యతిరేకించారు. అలాగే, కామారెడ్డి నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పోటీకి దించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించినా రాజా రెడ్డి పేరును ఎఐసిసి ఖరారు చేసింది. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డిని, స్టేషన్ ఘనపూర్ నుంచి రాజారపు ప్రతాప్ను పోటీకి దించుతున్నట్లు ప్రకటించింది. ఆదిలాబాద్ అభ్యర్థిగా రామచంద్రా రెడ్డిని ఖరారు చేసింది. నాగర్ కర్నూలు నుంచి దామోదర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితాను రూపొందించి, జాబితాతో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీకి వెళ్లేలోగానే అభ్యర్థుల పేర్లను ఐఎసిసి ప్రకటించింది. కోవూరు సీటుకు పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డిని ఖరారు చేసింది
xxxxxxxxxxxxxxxxxxxxxxxx

జగన్ సమావేశానికి 13 మంది ఎమ్మెల్యేలు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మంగళవారం నిర్వహించిన సమావేశానికి 13 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. శాసనసభలో, శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై, ఉప ఎన్నికలపై ఆయన శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేశారు. తామంతా కలిసికట్టుగానే ఉన్నమని వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు ప్రకటించారు. శాసనసభలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలపై గళమెత్తాలని వైయస్ జగన్ తమకు సూచించినట్లు మేకపాటి సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారుప్రజాసమస్యలపై ప్రభుత్వం ఒత్తిడి తేవాలని శాసనసభ్యులు నిర్ణయించారు. ఉప ఎన్నికల తర్వాత మరింత మంది శాసనసభ్యులు పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కొండా సురేఖ, అమరనాథ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి చెప్పారు. శాసనసభా సమావేశాలకు ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. శాసనసభలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని శాసనసభ్యులు నిర్ణయించుకున్నారు. వచ్చే నెల 2,3,4 తేదీల్లో జగన్ నెల్లూరు కోవూరు శాసనసభ నియోజకవర్గంలో ప్రచారం సాగించనున్నారు
xxxxxxxxxxxxxxxxxxxxx

ప్రభుత్వానికి గవర్నర్ ఝలక్

వర్నర్ నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం ఝలక్ ఇచ్చారు. సమాచార హక్కు కమిషనర్ల నియామక ఫైలును నరసింహన్ తిప్పి పంపారు. అనుభవం లేని వారిని కమిషనర్లుగా నియమించారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కమిషనర్ల నియామకాన్ని పున పరిశీలించాలని రాజ్ భవన్ ప్రభుత్వానికి సూచించింది నేపథ్యంలో రాజకీయ నాయకులను కమిషనర్లుగా నియమించడాన్ని గవర్నర్ తప్పు పట్టారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎనిమిది మందితో కూడిన ఫైల్ను పంపించింది. అందులో నలుగురు పేర్లను గవర్నర్ తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. అయితే తిరస్కరింపబడిన నలుగురు ఎవరు, ఆమోదింపబడిన నలుగురు ఎవరనే విషయం ఖచ్చితంగా తెలియరాలేదు ఇంతియాజ్ అహ్మద్, విజయ నిర్మల, కోనేరు తాంతియా కుమారి పేర్లను తిరస్కరించినట్లుగా సమాచారం.

xxxxxxxxxxxxxxxxxxxxxxxx

రామ్ చరణ్కుఈగషాక్!

రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలోరచ్చచిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. చివరి దశకు చేరుకున్న చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే నెలలో ఇతర పెద్ద సినిమాలు ఏవీ లేవని ధైర్యంగా ఉన్న రామ్ చరణ్కు రాజమౌళి ఈగ రూపంలో షాక్ తగిలింది. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందుతున్న ఈగ చిత్రాన్ని కూడా ఏప్రిల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే జరిగితేరచ్చసినిమాకు భారీగా పోటీ తప్పదని, ముఖ్యంగా రాజమౌళి మార్కు సినిమా కాబట్టి రామ్ చరణ్రచ్చసినిమా కంటే కూడాఈగసినిమాపైనే జనాలకు ఎక్కువ ఆసక్తి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్గబ్బర్ సింగ్చిత్రం కూడా దాదాపుగా రెండు చిత్రాలకు దగ్గరగానే విడుదలవుతోంది. మరి ఏం జరుగబోతోందో..? మరో నెల రోజులు ఆగితే గానీ తెలియదు.
xxxxxxxxxxxxxxxxxxxx